
By - Chitralekha |22 Aug 2023 12:20 PM IST
బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటనతో ఆ పార్టీలోని ఆశావహులతో పాటు వామపక్షాలకు కేసీఆర్ షాకిచ్చారు. కేసీఆర్పై సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. నమ్మించి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు ఇవాళ సమావేశం కావాలని నిర్ణయించారు.కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు భేటీ అవుతారు. సమావేశంలో అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే నిర్ణయించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com