
By - Chitralekha |21 Aug 2023 4:02 PM IST
తక్షణం అగనంపూడి టోల్ గేటును తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో టోల్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనేక ఏళ్లుగా అక్రమంగా, చట్టవిరుద్ధంగా అగనంపూడి టోల్ గేట్ కొనసాగుతుందని సీపీఎం నాయకుడు గంగారావు అన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో టోల్ గేట్లు ఉండకూడదనే నిబంధనలను కూడా ధిక్కరిస్తూ కేంద్రం ప్రజలను నిలువుదోపిడీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 25 సంవత్సరాల నుంచి దారి దోపిడి చేస్తున్నారని.. ఇప్పటి వరకు సుమారు 700 కోట్లకు పైగా వసూలు చేశారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com