
By - Vijayanand |27 Aug 2023 1:06 PM IST
కాసేపట్లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు కొనసాగే ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చిందని భావిస్తున్న సీపీఎం నేతలు.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై చర్చించనున్నారు సీపీఎం నేతలు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com