By - Vijayanand |9 Jun 2023 11:37 AM GMT
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని అన్నారు సీపీఐ రామకృష్ణ. పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీల భారాన్ని ప్రజలపై గుదిబండలా వేశారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటూ మరో బాదుడుకు సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com