
By - Chitralekha |2 Aug 2023 1:14 PM IST
విజయవాడ వాంబే కాలనీ లో సీపీఎం ధర్నా చేపట్టింది. డిస్నీ లాండ్లో కబేళా ఏర్పాటు చేయాలన్న కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టింది. ప్రభుత్వం పేదలను చిన్నచూపు చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. నివాసాల మధ్య కబేళా ఏర్పాటు చేయడమేంటని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిస్నీ లాండ్ లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జగన్ ది పేదల ప్రభుత్వం కాదని పెత్తందార్ల ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com