By - Vijayanand |27 Aug 2023 6:35 AM GMT
సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్లో కొంత మాయం చేసిన ఎస్ఐ.. వాటిని అమ్ముకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో.. ఎస్ఐ రాజేందర్ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న టీమ్లో సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజేందర్ కూడా ఉన్నారు. అయితే.. సీజ్ చేసిన డ్రగ్స్లో కొంత మాయం అయినట్లు గుర్తించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com