
By - Chitralekha |1 Aug 2023 1:29 PM IST
అనంతపురం జిల్లా శెనిగల గూడూరులో దళిత యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు దాడి చేశారు. అయితే తమ వర్గానికి చెందిన అమ్మాయిని వేధించింనందుకే కొట్టామంటూ పోలీసులకు అగ్రవర్ణాలు తెలియజేసినట్లు సమాచారం. తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్పీ, కలెక్టర్లకు దళితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇరు వర్గాలకు డీఎస్పీ సర్ది చెప్పారు. మరోవైపు దళితుల్ని ఏ పనులకు పిలవకూడదని అగ్రవర్ణాలు తీర్మానించాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. దాంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com