దళితులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన

దళితులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంలో దళితులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్న కాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టామా కేర్ సెంటర్ నిర్మాణం పేరుతో తమ భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. స్థలం పరిశీలించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. కొలతలు వేయనీయకుండా ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అధికారులకు అడ్డుపడితే కేసులు పెడతామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

Next Story