By - Vijayanand |3 Aug 2023 1:44 PM GMT
సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాలాభిషేకం చేశారు. 19వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నలు దిశలా మెట్రో విస్తరణ.. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పాలనను అభినందిస్తూ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్తున్న సీఎం కేసీఆర్కు ఫ్లకార్డులతో ఘనస్వాగతం పలికారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com