
By - Sathwik |17 Oct 2023 10:30 AM IST
విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు,వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు అమ్మవారికి మెుక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com