Manyam District: మృతదేహాన్ని బైక్‌పై 35 కి.మీ తరలింపు

Manyam District: మృతదేహాన్ని బైక్‌పై 35 కి.మీ తరలింపు

పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విధారక ఘటన జరిగింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు వైద్య సిబ్బంది నిరాకరించింది. దీంతో కుటుంబసభ్యులు డెడ్‌ బాడీని 35 కి.మీ మేర ఒడిషా సరిహద్దు నుంచి ఏపీలోని సాలూరు వరకు బైక్‌పై తరలించారు. సాలూరు మండలం ఎగువ గంజాయి భద్ర గ్రామానికి చెందిన గమ్మిలి విశ్వనాధ్ ఒడిషాలోని పొట్టంగి తాసిల్దార్ కార్యాలయానికి కుల ధృవీకరణ పత్రం కోసం వెళ్లాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వస్తుండగా కుందిలి గ్రామం వద్ద వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందాడు.

Next Story