By - Bhoopathi |25 Jun 2023 6:45 AM GMT
బాపట్ల జిల్లా వైసీపీ నేత ఇంట్లో భారీగా ఢిల్లీ మద్యంను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కర్రపాలెం మండల వైసీపీ నేత కప్పల నారాయణ రెడ్డి ఇంట్లో 227 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షా 36 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఢిల్లీలో 130 రూపాయలకు కొని ఏపీలో ఆరు వందల రూపాయలకు అమ్ముతున్న ముఠాను కాపు కాసి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఢిల్లీలో తక్కువ ధరకు మద్యాన్ని కొని స్థానికంగా ఎక్కువ రేటుకు అమ్ముతూ లాభం పొందుతున్నారు వైసీపీ నేతలు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com