By - Subba Reddy |3 May 2023 9:15 AM GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆడిటర్ బుచ్చిబాబుకు మళ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బుచ్చిబాబు వచ్చారు. ఇప్పటికే అనేకసార్లు బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో కొద్దిరోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసులోని పలువురు నిందితులను ఈడీ ప్రశ్నించనుంది. అందుకు ప్రత్యేక కోర్టు అనుమతి కూడా కోరింది. విజయ్ నాయర్, అమిత్ అరోరాలను మరోసారి ప్రశ్నించేందుకు కోర్టు ఈడీకి అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును ఈడీ మరోసారి పిలవడం ఆసక్తి రేపుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com