ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వర్గానికి చెందిన N.D.C.C.B ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. వ్యతిరేక వర్గానికి చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. N.D.C.C.B ఛైర్మన్ ను విమర్శించాడని తనని స్తంభానికి కట్టేసి కొట్టారని బాధితుడు వాపోయాడు. పోలీసుల ఎదుటే నిర్భందించి కొడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ నూతన సమన్వయకర్త నియామకం పై అసమ్మతి సెగలు ఎదరవుతున్నాయి. ఇంఛార్జ్ గా ఈవూరు గణేష్ ని నియమించటంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. వైసీపీ సమన్వయ కర్తగా నియామకంపై అధిష్టానం పునరాలోచన చెయ్యాలని వైసీపీ జెడ్పీటీసీ బొర్రా లక్ష్మి భర్త శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ పున పరిశీలన చేసి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com