By - Vijayanand |7 July 2023 8:46 AM GMT
సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తమిళనాడుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డీఐజీ ర్యాంకుకు చెందిన విజయ్ కుమార్ తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. కోయంబత్తూర్ సర్కిల్లో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది. పోస్ట్మార్టం కోసం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు మృతదేహాన్ని తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి విజయ్ కుమార్ డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com