AP: ఏపీలో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్

AP: ఏపీలో పలుచోట్ల  డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్

ఏపీలో పలుచోట్ల డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేస్తున్నారు. కార్డ్ 2.0ను అమలు చేయోద్దంటూ నిరసన చేశారు. విశాఖ, మధురవాడలో డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనకు దిగారు. పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్నామని,.. డాక్యుమెంట్ విధానాన్ని డిజిటలైజేషన్ ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము రోడ్డును పడతామంటున్నారు. ప్రైమ్ 2.0 అనే కొత్త విధానంతో డాక్యుమెంట్లలో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెన్ డౌన్ చేస్తున్నారు డాక్యుమెంట్‌ రైటర్లు.

Next Story