
By - Vijayanand |14 Aug 2023 12:27 PM IST
హైదరాబాద్ ప్రగతి నగర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొట్టి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు, బాధితులు పట్టుకుని చితకబాదారు. పలు ద్విచక్ర వాహనాలను, రోడ్డుపై నిలిపి ఉంచిన కారును ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా కారును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనదారులు, కారును వెంబడించి కూకట్పల్లి ఎల్లమ్మ చెరువు వద్ద అడ్డుకున్నారు. ఇద్దరు యువకులను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకుని గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com