By - Bhoopathi |14 Jun 2023 5:30 AM GMT
జమ్ముకశ్మీర్లోని దోడా కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ, హిమాచల్, హర్యానాతో పాటు పంజాబ్, పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్లపాటు తీవ్రస్థాయిలో కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైంది. భూకంప తాకిడికి జమ్ముకశ్మీర్లో పలు ఇండ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. దోడాలోని ఓ సబ్ డిస్ట్రిక్ హాస్పిటల్లో రోగులకు గాయాలయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com