By - Vijayanand |20 May 2023 10:23 AM GMT
పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటన శనివారం జరిగింది. 7.1 తీవ్రతతలో భూకంపం సంభవించిందని US జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 35 కిలోమీటర్లు లోతుగా ఉందని అధికారులు తెలిపారు. న్యూ కాలెడోనియన్ ద్వీపసమూహానికి తూర్పున 300 కిలోమీటర్లు దూరంలో ఉందని పేర్కొన్నారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సునామీ అలలు 0.3 మీటర్లు కంటే తక్కువగా ఉండవచ్చని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com