
By - jyotsna |20 Feb 2025 12:00 PM IST
ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ను భూకంపం వణికించింది. గారో హిల్స్ లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com