
By - Vijayanand |19 Aug 2023 4:38 PM IST
మంత్రి కేటీఆర్కు కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు... చూసేది బీఆర్ఎస్ నేతలు అంటూ కామెంట్ చేశారు. గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బాధ్యులపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com