
By - Sathwik |20 Jun 2024 9:45 AM IST
బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. మహిపాల్రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి ఈడీ తనిఖీలు చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తనిఖీల్లో ఈడీ అధికారులు ఏమైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారమో తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com