
కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం... నేటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సహా ఇతర అధికారులు విజయవాడ చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం రాజకీయ పార్టీలతో భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదుల పై... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీల తో సీఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత పై A.P C.E.O ముఖేష్ కుమార్ మీనా బుధవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్ర విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దిల్లీకి కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు తిరిగి వెళ్లనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com