ఏపీలో ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు

ఏపీలో ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు

ఏపీలో ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బల్క్‌గా ఓట్ల తొలగింపుపై ఫిర్యాదులు రావడంతో.. వెరిఫికేషన్, నిర్ధారణ వంటి అంశాల్లో నిబంధనలను సూచించింది. 2020వ సంవత్సరం.. ఒకటో నెల.. 6వ తేదీ నుంచి ఇప్పటివరకు జరిగిన ఓట్ల తొలగింపును చెక్‌ చేయాలంది. డెత్‌, షిఫ్టింగ్‌ సహా పలు కారణాలతో తొలగించిన ఓట్లపై పునపరిశీలన జరపాలంది. ఓట్ల తొలగింపుపై జిల్లా స్థాయ అధికారుల తోపాటు, కలెక్టర్‌ ద్వారా వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది.

Next Story