
By - Bhoopathi |15 July 2023 12:45 PM IST
ఎన్నికలు తరుముకొస్తున్న వేళ నేతలు యాత్రలు చేపట్టాలని అగ్రనాయకత్వం సూచిస్తోంది.నిత్యం ప్రజల మధ్యే వుండేలా చూసుకోవాలని రాహుల్ గాంధీ హితబోధ చేస్తున్నారు. యాత్రల ద్వారా పలు అంశాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలంటూ వరుసగా ఆయా రాష్ట్రాల నేతలతో రాహుల్ గాంధీ సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తున్నారు.కలిసికట్టుగా బస్సు యాత్రలు చేయాలని సూచిస్తున్నారు.రాహుల్ గాంధీ రెండో యాత్ర కూడా చేపడతారని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది.ఐతే ఈ యాత్రపై ఇంకా స్పష్టత రాలేదు.రాహుల్ పిలుపు మేరకు తెలంగాణాలో కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com