By - Chitralekha |3 Aug 2023 9:02 AM GMT
ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల పిలుపు మేరకు తిరుపతిలో నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు సానుకూలంగా లేవని ఉమ్మడి చిత్తూరు జిల్లా జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. కేవలం ఫిట్మెంట్ 5శాతం ఇచ్చేందుకు అంగీకరించడం శోచనీయమని మండిపడుతున్నారు. తమ సమస్యలను విద్యుత్ మెనేజ్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com