BJP: "మోదీ వరంగల్‌ సభ సక్సెస్‌ చేస్తాం"

BJP: మోదీ వరంగల్‌ సభ సక్సెస్‌ చేస్తాం

కనీవినీ ఎరుగని రీతిలో మోదీ వరంగల్‌ సభను సక్సెస్‌ చేసి తీరుతామని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మొదటిసారి ఓరుగల్లు గడ్డ మీదకు మోదీ వస్తున్నారన్నారు. ప్రజలకు తానున్నాననే భరోసా ఇవ్వడానికి ఆయన వరంగల్‌ వస్తున్నారని చెప్పారు. ఇక.. అసహనంతో కొంతమంది తమ పార్టీపై విషం కక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ గెలుపునకు వ్యూహ రచన చేయాలని నడ్డాకు.. మోదీ సూచించారని.. కుటుంబ పాలనకు అంతం పలికేది బీజేపీనే అన్నారు.

Next Story