
By - Vijayanand |8 Aug 2023 5:31 PM IST
అసెంబ్లీ స్పీకర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే.. గన్ మెన్స్ రూమ్లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు.ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేకు కన్వెన్షన్ ఉంటాయని.. వాటిని ఎక్కడా స్పీకర్ పాటించలేదన్నారు. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేరాలేదని.. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com