By - Chitralekha |22 July 2023 11:24 AM GMT
సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. అధికారం కోసం కుటుంబ సభ్యులను వాడుకొని వదిలేశారన్నారు. ఇప్పుడు జగన్ పక్కన ఉన్న వారే.. గతంలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వైసీపీ పేరుతో వైఎస్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని చెప్పారు. ప్రజలు కూడా ఆయన్ను సాగనంపడానికి అంతకంటే ఎక్కువగా వేచి చూస్తున్నారన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com