
By - Chitralekha |5 Aug 2023 2:49 PM IST
మంత్రి కారుమూరి నాగేశ్వర రావు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, దాన్ని నిరసిస్తూ సకల జనుల దీక్ష చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాలు సోదరభావంతో ఒకే కుటుంబంగా ఉంటారని, గ్రామ పంచాయతి అనేక సార్లు ఉత్తమ పంచాయతిగా గుర్తింపు పొందిందని తెలిపారు. అక్కడ మంత్రి కారుమూరి తన రాజకీయ స్వార్ధం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com