
By - Vijayanand |21 Aug 2023 12:05 PM IST
నిర్మల్ జిల్లాలో నూతన మాస్టర్ ప్లాన్ తీవ్ర దుమారం రేపుతోంది. 220 జీవో రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను ఆర్ధరాత్రి భగ్నం చేశారు పోలీసులు. గత 5 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. షుగర్,బీపీ లెవల్స్ పడిపోవడంతో అరెస్ట్ చేసి.. నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలించారు. అయితే మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదన్న మహేశ్వర్రెడ్డి అస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏరియా అస్పత్రికి భారీగా చేరుకుంటున్న బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com