By - Chitralekha |31 Aug 2023 10:41 AM GMT
విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నేత, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు లేఖ పంపారు. కొండలరావు అరకు నియోజకవర్గం పరిశీలకునిగా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాసరావు.. గజపతినగరం టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న తన తమ్ముడు కొండపల్లి అప్పలనాయుడు, తన కుమారుడుతో కలిసి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com