
By - Chitralekha |21 Aug 2023 4:27 PM IST
యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అందరూ మాతృభాషలో మాట్లాడండి.. మాతృభాష మర్చిపోవద్దని విద్యార్ధులకు సూచించారు. గుంటూరులో భాష్యం విద్యాసంస్థల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. భాష్యంలో చదవి జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీ 5, 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులను మాజీ ఉపరాష్ట్రపతి సన్మానించారు. ఇష్టపడి, కష్టపడి చదవాలన్నారు. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దని సూచించారు. చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని వెంకయ్య నాయుడు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com