By - Bhoopathi |5 July 2023 8:15 AM GMT
కర్నూలులో నకిలీ ఐదు వందల రూపాయల నోట్లను చలామణికి ప్రయత్నించిన 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. కర్నూలుకు చెందిన నలుగురు యువకులతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా క్యాతూరుకు చెందిన మరో నలుగురు నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ప్రయత్నించారు. రూ. 90 లక్షల నకిలీ నోట్లకు రూ.30 లక్షల ఒరిజినల్ నోట్లు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం నకిలీ నోట్ల బ్యాగులు మార్చుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి కోటి 30 లక్షల నకిలీ 500 నోట్లను, బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com