HYD: సీఐడీ అధికారులమని చెప్పి కిడ్నాప్‌

HYD: సీఐడీ అధికారులమని  చెప్పి కిడ్నాప్‌

సీఐడీ అధికారులమంటూ హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో సోదాలు చేసి ఆ సంస్థ డైరెక్టర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నాడు. గచ్చీబౌలిలోని అజయాడ్ ఐటీ కంపెనీలో ఈనెల 27న తొమ్మిది మంది ఏపీ సీఐడీ అధికారులమని తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో కంపెనీపై కేసు నమోదైందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తనిఖీలు చేపడుతున్నామని కార్యాలయంలోని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత సంస్థ డైరెక్టర్ , మరో ఉద్యోగిని.. ఓ హోటల్ కు తీసుకుని వెళ్లారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి 2.3కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. 10లక్షలు రూపాయలు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో కర్నూలుకు చెందిన ఎస్ ఐ సుజన్ ..... కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు.

Next Story