By - Chitralekha |16 Aug 2023 11:27 AM GMT
అమరావతి టు నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాలంటూ అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రైతులు పోరుబాట్టారు.కలెక్టరేటే గేట్ ముందు ధర్నాకు దిగిన రైతులు కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నేషనల్ హైవే పేరుతో పచ్చని పంట పొలాలను తీసుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. చింతకాని, రఘునాథపాలెం మండలాలలో సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ రైతులు మండిపడ్డారు. ఎకరానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com