
By - Chitralekha |18 July 2023 12:41 PM IST
గుంటూరులో ఛానల్ పొడగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘాలు ఆందోళనను ఉధృతం చేశారు. కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా.. రైతుల మహాధర్నాకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి రైతులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. కలెక్టరేట్ వైపు రైతులెవరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అటు.. రైతుల రిలే దీక్షకు టీడీపీ, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. గత 20 రోజులుగా దశలవారీగా ఆందోళన చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని నల్లమడ రైతు సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com