
By - Chitralekha |22 July 2023 4:43 PM IST
వైసీపీ ప్రభుత్వంలో రైతులు రైతు కూలీలుగా మారిపోతున్నారు.. పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారు.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు... ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్నా వర్షాలు పడక రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.. పంటలు వేసినా ఆ పంట చేతికందక అప్పుల పాలై లబోదిబోమంటున్నారు. కనీసం ప్రభుత్వం విద్యుత్ సరఫరాను కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తిరుపతి జిల్లాలోని రైతులు ప్రాధేయపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com