వైసీపీ ప్రభుత్వంలో కూలీలుగా మారుతోన్న రైతులు

వైసీపీ ప్రభుత్వంలో కూలీలుగా మారుతోన్న రైతులు

వైసీపీ ప్రభుత్వంలో రైతులు రైతు కూలీలుగా మారిపోతున్నారు.. పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారు.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు... ఖరీఫ్‌ సీజన్‌ కొనసాగుతున్నా వర్షాలు పడక రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.. పంటలు వేసినా ఆ పంట చేతికందక అప్పుల పాలై లబోదిబోమంటున్నారు. కనీసం ప్రభుత్వం విద్యుత్‌ సరఫరాను కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తిరుపతి జిల్లాలోని రైతులు ప్రాధేయపడుతున్నారు.

Next Story