
By - Vijayanand |11 Aug 2023 4:20 PM IST
హైదరాబాద్లోని కొంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికకు ఫోన్ ఆశచూపి అత్యాచారం చేశారు తండ్రికొడుకులు. కడుపు నొప్పితో బాధపడుతూ తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది బాధతురాలు. బాలిక ఇంటి పక్కనే నిందితులు శివకుమార్, సామిల్ నివసిస్తున్నారు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో బాధతురాలు చికిత్స పొందుతుంది. కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com