
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యమేనని (Indian Army) సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రాంచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. దేశసేవ చేయాలంటే సైన్యంలో చేరాలన్న లక్ష్యం పెట్టుకోవాలని చిన్నారులకు సూచించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రకృతి విపత్తు ఘటనల్లో అనేక మంది పౌరులను రక్షించేందుకు సైన్యం కృషి చేసిందన్నారు.
‘‘బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం సైన్యం. దేశసేవ చేయాలనుకుంటే, దేశంతోపాటు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే త్రివిధ దళాల్లో చేరడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇక్కడ కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుంది’’ అని జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. చిన్నారులతో ముచ్చటించిన ఆయన.. ఈ ఏడాది ప్రకృతి విలయ సంఘటనలు అధికంగా చోటుచేసుకున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లలో అనేక మందిని రక్షించేందుకు సాయుధ దళాలు తీవ్ర కృషి చేశాయన్నారు.ఆపరేషన్ సిందూర్ గురించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. మే 7న అర్ధరాత్రి శత్రు స్థావరాలపై దాడులు చేశామని, ఒంటి గంటకు తొలి దాడి జరిగిందని చెప్పారు. సుదీర్ఘ లక్ష్యాలపై రాత్రి వేళల్లో దాడులు చేయాలంటే ప్రత్యేక కృషి అవసరమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com