
By - Vijayanand |8 Aug 2023 6:05 PM IST
తూర్పుగోదావరి జిల్లా బిక్కవొలు మండలం తొస్సిపూడిలో.....ఓ బాణాసంచా గోడౌన్లో పేలుడు జరిగింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమీపంలో ఉన్న రైస్ మిల్లు, పెట్రోల్ బంక్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. తొస్సిపూడిలోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర ఓ గదిలో అక్రమంగా బాణాసంచాను నిల్వ చేశారు. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో చుట్టుపక్కలవారు భయభ్రాంతులకులోనయ్యారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com