
By - Bhoopathi |19 Jun 2023 1:45 PM IST
ఫిలిప్పీన్స్లోని బోహోల్ ద్వీపంలో 120 మంది ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన కోస్టోగార్డు మంటల్ని ఆర్పేసింది. మొత్తం 120 మంది ప్రయాణికులతో పాటు సిబ్బందిని కాపాడారు. మంటలు ఆరిపోయాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు కోస్ట్ గార్డు సిబ్బంది. నౌక సిక్విజోర్ మరియు బోహోల్ దీవుల మధ్య ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. కోస్ట్ గార్డ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి రెస్క్యూ షిప్లు పాంగ్లావ్, బోహోల్ జలాల్లోనే ఉంటాయని తెలిపారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com