Hyderabad: రన్నింగ్ బస్సులో మంటలు

Hyderabad: రన్నింగ్ బస్సులో మంటలు

హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేట సమీపంలో రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆర్టీసీ బస్సు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముందు భాగం పూర్తిగా దగ్ధం అయ్యింది. వెంటనే అప్రమత్తం అయిన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story