
By - jyotsna |10 Dec 2025 12:45 PM IST
గుజరాత్లోని సూరత్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడంతస్తుల టెక్స్టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నట్లు సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపారు. సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బిల్డింగ్ పనులు జరుగుతున్నాయని.. అలాగే లోపల చాలా సామాగ్రి ఉందని తెలిపారు. 100-125 మంది అగ్నిమాపక అధికారుల, సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


