గుజరాత్.. శ్రీకాకుళం మత్స్యకారులకు తప్పిన ప్రాణాపాయం

గుజరాత్.. శ్రీకాకుళం మత్స్యకారులకు తప్పిన ప్రాణాపాయం

గుజరాత్ తీరంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ప్రాణాపాయం తప్పింది. విరావల్ సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటలో ఉండగా.. బోటు అకస్మాత్తుగా మునిగిపోయింది. దీంతో.. మత్స్యకారులు ఈదుకుంటూ పక్కనున్న బోట్లలోకి చేరుకున్నారు. రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్.. మత్స్యకారులను రక్షించింది. మునిగిపోయిన బోటులో రణస్థలం మండలానికి చెందిన 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అందరూ సేఫ్‌గా బయటపడడంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Next Story