
By - Bhoopathi |12 Jun 2023 4:45 PM IST
అన్నమయ్య జిల్లా గౌడ సానివారిపల్లిలో రైతుల నిరసన దీక్షకు దిగారు. సొంత నిధులతో రైతులు వేయించుకున్న రహదారిని వైసీపీ నేతలు జేసీబీలతో తవ్వించడంపై మండిపడుతున్నారు. వైసీపీ నేతల దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్షకు దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత నిధులతో పొలాలకు వెళ్లేదుకు వేసిన రహదారిని ధ్వంసం చేశారని మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com