Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…

Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 24 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రాజస్థాన్ రాష్ట్రంలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని దౌసాలో రైల్వే ట్రాక్‌పై నుంచి ప్రయాణికుల బస్సు పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో పలువురు గాయపడ్డారు. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినపుడు ఈ బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. బస్సు ప్రమాద స్థలాన్ని దౌసా అదనపు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కస్వా పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story