గుజరాత్లోని ద్వారకలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఏడు నెలల పాప, భార్యాభర్తలు, అమ్మమ్మ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు రావడంతో ఇంట్లో ఉన్నవారు ఊపిరాడక మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను పవన్ కమలేష్ ఉపాధ్యాయ్ (30 ఏళ్లు), భావన ఉపాధ్యాయ్ (27 ఏళ్లు), ధ్యాన ఉపాధ్యాయ్ (7 నెలల బాలిక), పవన్ తల్లి భామినీబెన్ ఉపాధ్యాయ్గా గుర్తించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com