
By - Chitralekha |23 Aug 2023 12:55 PM IST
జీహెచ్ఎంసీ కౌన్సిల్ కీలక సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత ఈ భేటీ కొనసాగుతోంది. బల్దియా కార్మికుల సమ్మెకు దిగిన నేపథ్యంలో.. కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. అటు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అటు జీహెచ్ఎంసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లను ఆమోదించాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com