రెండో రోజు కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

రెండో రోజు కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్, పారిశుధ్య, ఎంటమాలజీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. నేటి నుంచి జీహెచ్ఎంసీకి చెందిన అన్ని కార్యాలయాల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు విధులకు రాకుండా పనులు స్తంభింపచేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, రెగ్యూలర్ ఉద్యోగులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story